కేబుల్‌ వంతెన..మాక్‌ డిస్‌ ప్లే ప్రారంభం..!

ABN , First Publish Date - 2020-09-17T10:00:54+05:30 IST

దుర్గం చెరువుపై ఎక్స్‌ట్రా డోస్‌ ఇంజనీరింగ్‌ పరిజ్ఞానంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేబుల్‌ వంతెన మాక్‌ అప్‌ డిస్‌ప్లేను

కేబుల్‌ వంతెన..మాక్‌ డిస్‌ ప్లే ప్రారంభం..!

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 16 (ఆంధ్రజ్యోతి): దుర్గం చెరువుపై ఎక్స్‌ట్రా డోస్‌ ఇంజనీరింగ్‌ పరిజ్ఞానంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేబుల్‌ వంతెన మాక్‌ అప్‌ డిస్‌ప్లేను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ బుధవారం ప్రారంభించారు. వంతెనకు సంబంధించిన యానిమేషన్‌ వీడియోను ఈ సందర్భంగా ఆయన తిలకించారు. రంగు రంగుల థీమ్‌లతో కూడిన మాక్‌ డిస్‌ ప్లే, వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రపంచంలోనే పొడవైన స్పాన్‌ బ్రిడ్జి ఇదని అధికారులు చెబుతున్నారు. రూ.184 కోట్లతో కేబుల్‌ బ్రిడ్జి నిర్మించారు. ఈ నెల 18వ తేదీన వంతెన ప్రారంభించాలని భావించగా.. పలు కారణాలతో 19వ తేదీకి వాయిదా పడింది. రాకపోకలతో పాటు థీమటిక్‌ లైటింగ్‌, చెరువు పరిసర ప్రాంతాల్లో వినూత్న అభివృద్ధితో కేబుల్‌ వంతెన పర్యాటక ప్రాంతంగా మారుతుందని, హైదరాబాద్‌కు మరో ఐకానిక్‌ అవుతుందని ఓ అధికారి చెప్పారు. 

Updated Date - 2020-09-17T10:00:54+05:30 IST