పాతబస్తీ లాల్ దర్వాజ బోనాల ఉత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-07-19T15:48:23+05:30 IST

తెలంగాణలో నిర్వహించే బోనాల్లో.. పాతబస్తీ లాల్‌దర్వాజ బోనాలు విశిష్ఠమైనవని నగరవాసులు చెబుతుంటారు.

పాతబస్తీ లాల్ దర్వాజ బోనాల ఉత్సవాలు ప్రారంభం

హైదరాబాద్ : తెలంగాణలో నిర్వహించే బోనాల్లో.. పాతబస్తీ లాల్‌దర్వాజ బోనాలు విశిష్ఠమైనవని నగరవాసులు చెబుతుంటారు. ఆదివారం తెల్లవారు జామునే 3 గంటలకే బోనాలు ప్రారంభమయ్యాయి. మొదట అమ్మవారికి అర్చకులు జల కడవ సమర్పించారు. సాయంత్రం 6 గంటలకు అమ్మవారి శాంతి కళ్యాణం జరగనుంది. అక్కన్న- మాదన్న ఆలయంలతో పాటు అన్ని పురాతన అమ్మవారి ఆలయాల్లో పూజలు ఇప్పటికే మొదలయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ఆలయ కమిటీ ఉత్సవాలు నిర్వహిస్తోంది. కరోనా నేపథ్యంలో భక్తులను ఆలయంలోకి అనుమతించలేదు. ఆలయ కమిటీ వారు మాత్రమే బోనాల సమర్పిస్తున్నారు. బోనాల సంరద్భంగా నాగుల చింత నుండి లాల్ దర్వాజా, ఓల్డ్ ఛత్రినాక పీస్ నుంచి లాల్ దర్వాజా, గౌలిపురా లాల్ దర్వాజా రోడ్లను ట్రాఫిక్ పోలీసులు మూసివేయడం జరిగింది.

Updated Date - 2020-07-19T15:48:23+05:30 IST