‘ప్రముఖుల జీవిత చరిత్రలను పాఠ్యాంశాల్లో చేర్చాలి’
ABN , First Publish Date - 2020-06-22T10:05:23+05:30 IST
సర్వాయి పాపన్న, ధర్మభిక్షం, దేశిన చినమల్లయ్య, మోగిలయ్యగౌడ్ల జీవిత చరిత్రలను పాఠ్యాంశాల్లో చేర్చాలని బీసీ సంక్షేమ

బర్కత్పుర, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): సర్వాయి పాపన్న, ధర్మభిక్షం, దేశిన చినమల్లయ్య, మోగిలయ్యగౌడ్ల జీవిత చరిత్రలను పాఠ్యాంశాల్లో చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్సగౌడ్, టీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర కార్యాలయాన్ని గాయత్రి అపార్ట్మెంట్స్లో ప్రారంభించారు.