బియ్యపు గింజలపై బతుకమ్మ
ABN , First Publish Date - 2020-10-23T10:02:22+05:30 IST
బతుకమ్మ పండగను పురస్కరించుకొని నగరానికి చెందిన కళాకారుడు నరేందర్ 108 బియ్యపు గింజలపై బతుకమ్మను చిత్రించాడు
హైదరాబాద్ సిటీ, అక్టోబర్ 22 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ పండగను పురస్కరించుకొని నగరానికి చెందిన కళాకారుడు నరేందర్ 108 బియ్యపు గింజలపై బతుకమ్మను చిత్రించాడు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మను బియ్యపు గింజలపై చిత్రించడం ద్వారా కళను సజీవంగా ఉంచుతూ పలు అవార్డులు సాధించినట్లు ఆయన తెలిపారు. బతుకమ్మ మహిళా శక్తికి ప్రతిరూపం. బతుకమ్మ రూపాలతోపాటు బతుకమ్మ తీసుకెళుతున్న మహిళల చిత్రాలను బియ్యపు గింజలపై చిత్రించారు. ప్రతి గింజపై రంగులతో బతుకమ్మను చిత్రించాలంటే కనీసం రెండు గంటల సమయం పడుతుందని చెప్పారు. చిన్నప్పటి నుంచి పెయింటింగ్పై ఆసక్తి ఉందని, డిగ్రీ కూడా చిత్రలేఖనంలోనే పూర్తిచేశానన్నారు. ఎన్ఐఆర్డీలో భారతీయ విధ్యాభవన్లో విధులు నిర్వహించే నరేందర్ 108 బియ్యపు గింజలపై బతుకమ్మను చిత్రించేందుకు 45 రోజుల సమయం పట్టిందన్నారు. త్వరలో పురాణ కావ్యాలను బియ్యపు గింజలపై చిత్రించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.