భద్రతలో ప్రైౖవేటు సెక్యూరిటీ సంస్థలకూ బాధ్యత ఉంది : చౌహాన్
ABN , First Publish Date - 2020-09-27T09:42:38+05:30 IST
భద్రతలో ప్రైౖవేటు సెక్యూరిటీ సంస్థలకూ బాధ్యత ఉంది : చౌహాన్
హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 26 (ఆంధ్రజ్యోతి): నగరంలో ప్రభుత్వ అనుమతి పొంది కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు సెక్యూరిటీ సంస్థల ప్రతి నిధులతో అడిషనల్ సీపీ డీఎ్స.చౌహాన్ శనివారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బషీర్బాగ్లోని కమిషనర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలు కూడా నగర రక్షణ విధుల్లో తమవంతు బాధ్యతను నిర్వహించాలని సూచించారు. సెక్యూరిటీ రంగంలో వచ్చిన కొత్త ఆవిష్కరణలు, మోడరన్ పోలీసింగ్, సెక్యూరిటీ వంటి అంశాలపై చర్చించారు. వినాయక నిమజ్జనం, మొహర్రం సందర్భాల్లో పెట్రోలింగ్, బందోబస్తు, వీడియో చిత్రీకరణ వంటి అంశాల్లో సహకరించిన సంస్థల ప్రతినిధులకు ఆయన జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో ఐఐటీఏ మొయినాబాద్కు చెందిన 35 సెక్యూరిటీ సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు.