రోజుకు 10 మంది రక్తదానం : బీజేవైఎం
ABN , First Publish Date - 2020-04-15T07:10:27+05:30 IST
లాక్డౌన్ నేపథ్యంలో తలసేమియా రోగులను ఆదుకోవడానికి బీజేవైఎం ముందుకొచ్చింది. మంగళవారం శివరాంపల్లి
![రోజుకు 10 మంది రక్తదానం : బీజేవైఎం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
రాజేంద్రనగర్, ఏప్రిల్14 (ఆంధ్రజ్యోతి): లాక్డౌన్ నేపథ్యంలో తలసేమియా రోగులను ఆదుకోవడానికి బీజేవైఎం ముందుకొచ్చింది. మంగళవారం శివరాంపల్లి రాఘవేంద్రకాలనీలోని తలసేమియా సికిల్ సెల్ సొసైటీకి యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి బొక్క బాల్రెడ్డి ఆధ్వర్యంలో 26 మంది నాయకులు వెళ్లి రక్తదానం చేశారు. ఇక మీదట వారం రోజుల పాటు రోజుకు 10 మంది చొప్పున రక్తదానం చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వారు తెలిపారు. కాగా.. ఆన్లైన్ బ్లడ్ డోనర్స్ పేరుతో వాట్సాప్ గ్రూప్ తయారు చేసిన హైదర్గూడ నివాసి, బీజేవైఎం నాయకుడు కొంగళ్ళ నవీన్ ఇప్పటి వరకు 32 సార్లు రక్తదానం చేశారు.