విధులు బహిష్కరించిన కార్మికులు
ABN , First Publish Date - 2020-08-09T07:16:18+05:30 IST
శ్రీరాంపూర్లోని భూగర్భ గనుల్లో కరోనా విజృంభిస్తున్నం దున లాక్డౌన్ విధించాలని శనివారం ఎస్ఆర్పీ-1వ గని కార్మికులు మొదటి ..
శ్రీరాంపూర్, ఆగస్టు 8: శ్రీరాంపూర్లోని భూగర్భ గనుల్లో కరోనా విజృంభిస్తున్నం దున లాక్డౌన్ విధించాలని శనివారం ఎస్ఆర్పీ-1వ గని కార్మికులు మొదటి బదిలీలో విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ప్రతి గనిలో పదుల సంఖ్యలో కార్మికులు కొవిడ్ పాజిటివ్ కారణంగా విధులకు హాజరు కాలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు కార్మికుల కుటుంబాలు సైతం ఇబ్బందులు పడుతున్నాయని, ఇప్పటికే కొందరు మృత్యువాత పడ్డారని చెప్పా రు. ఎస్ఆర్పీ-1వ గనిలో కరోనా నియంత్రణకు కార్మికులకు గ్లౌజులు, శానిటైజర్, మాస్కు లు, హైపోక్లోరైడ్ ద్రావణం స్ర్పే చేయడం వంటి రక్షణ చర్యలు పకడ్బందీగా అమలు చేయడం లేదన్నారు. పని ప్రవేశాల్లో భౌతికదూరం సాధ్యం కానందున యాజమాన్యం స్పందించి లాక్డౌన్ విధించి పూర్తి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్మికులు విధలు బహిష్కరించి ఇళ్లకు వెళ్లిపోయారు.