నూతన విద్యా విధానాన్ని స్వాగతిస్తున్నాం
ABN , First Publish Date - 2020-08-03T10:36:14+05:30 IST
నూతన విద్యా విధానాన్ని స్వాగతిస్తున్నట్లు జిల్లా ట్రస్మా అధ్యక్షుడు పెద్దపల్లి కిషన్రావు అన్నారు.
ట్రస్మా జిల్లా అధ్యక్షుడు పెద్దపల్లి కిషన్రావు
ఆసిఫాబాద్రూరల్, ఆగస్టు2: నూతన విద్యా విధానాన్ని స్వాగతిస్తున్నట్లు జిల్లా ట్రస్మా అధ్యక్షుడు పెద్దపల్లి కిషన్రావు అన్నారు. ఆదివారం ఆసిఫాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన విద్యా విధానంతో విద్యార్థుల్లో సృజనాత్మకత మెరుగుపడుతుందన్నారు. మూడు సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వారికి నిర్బంధ విద్య, వృత్తి విద్య బోధన అంశాలు మెరుగు పరచడం జాతీయ విద్యా విధానంలో భాగమన్నారు. ఈ సమావేశంలో ట్రస్మా కార్యదర్శి సుదర్శన్గౌడ్, అసోసియేట్ అధ్యక్షుడు చిలూకూరి రాధకృష్ణచారి తదితరులు పాల్గొన్నారు.