గ్రామీణ క్రీడల అభివృద్ధికి కృషి చేయరూ!

ABN , First Publish Date - 2020-12-20T06:53:48+05:30 IST

గ్రామీణ క్రీడల అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ కేంద్ర క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌రిజీజు ను ఎంపీ సోయం బాపురావు శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు.

గ్రామీణ క్రీడల అభివృద్ధికి కృషి చేయరూ!
ఢిల్లీలో కేంద్ర మంత్రికి విన్నవిస్తున్న ఎంపీ సోయం బాపురావు

కేంద్ర మంత్రికి ఎంపీ సోయం బాపురావు వినతి

ఆదిలాబాద్‌ టౌన్‌, డిసెంబరు 19: గ్రామీణ క్రీడల అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ కేంద్ర క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌రిజీజు ను ఎంపీ సోయం బాపురావు శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. కొవిడ్‌-19 కారణంగా గత తొమ్మిది నెలలుగా దేశవ్యాప్తంగా క్రీడా పోటీ లు, శిక్షణ కార్యక్రమాలు నిలిచిపోయాయని, త్వరలో అన్ని క్రీడలకు పూర్వ వైభవం తీసుకొస్తూనే.. గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేస్తామని కేంద్ర మంత్రి అన్నారని ఎంపీ తెలిపారు. అలాగే, తెలంగాణలో వెనుకబడ్డ ఆదిలాబాద్‌ జిల్లాలో సైతం క్రీడారంగాన్ని అభివృద్ధి పరిచి గ్రామీణ క్రీడలని వెలికి తీస్తామని హామీ ఇచ్చారని సోయం తెలిపారు. ఈ మేరకు   కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశామని ఎంపీ తెలిపారు.

Updated Date - 2020-12-20T06:53:48+05:30 IST