కొవిడ్-19 పరీక్షల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం
ABN , First Publish Date - 2020-08-11T10:19:42+05:30 IST
జిల్లా కేంద్రంలో కొవిడ్-19 పరీక్ష లు జరపడంలో అధికారు లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారని బీజేపీ జిల్లా అధి కార ప్రతినిధి తులా మధు సూదన్

ఏసీసీ, ఆగస్టు 10: జిల్లా కేంద్రంలో కొవిడ్-19 పరీక్ష లు జరపడంలో అధికారు లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారని బీజేపీ జిల్లా అధి కార ప్రతినిధి తులా మధు సూదన్ పేర్కొన్నారు. సోమ వారం బీజేపీ కార్యాలయం లో విలేకరులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో తక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వ హిస్తున్నారన్నారు. సెలవుది నాల్లో కూడా టెస్టులు జరపాలని డిమాండ్ చేశారు.
హోంక్వారంటైన్ ఉన్న వారికి ప్రభుత్వం కిట్లు అందించడంలో పర్యవేక్షణ లోపిం చిందన్నారు. కరోనా నివారణలో ముగ్గురు ఎమ్మెల్యేలు విఫలమయ్యారని, వారు ఆసుపత్రులను సందర్శించలేద న్నారు. జిల్లా కేంద్రంలో రెండు అంబులెన్స్కు ఒక డ్రైవర్ ఉన్నా డని, కొవిడ్ పేషెంట్లు చికిత్స కోసం హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తే ప్రైవేటు అం బులెన్స్కు దాదాపు రూ.20వేల వరకు చెల్లించవలసి వస్తోందని ఆరోపించారు. మంచిర్యాలలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, హరికృష్ణ, రాజమౌళి, సత్యనారాయణ రావు, మ ల్లేష్, లక్ష్మినారాయణ, మధు, దేవేందర్, కృష్ణ, పళ్ళు రాకేష్ పాల్గొన్నారు.