అటవీ జంతువులకు హాని కలిగిస్తే కఠినచర్యలు
ABN , First Publish Date - 2020-05-26T05:48:41+05:30 IST
అటవీ జంతువులకు హాని తలపెడితే కేసులు నమోదు చేసి కఠినచర్యలు తీసుకొంటామని సీఐ
లక్షెట్టిపేట/జన్నారం/దండేపల్లి, మే 25: అటవీ జంతువులకు హాని తలపెడితే కేసులు నమోదు చేసి కఠినచర్యలు తీసుకొంటామని సీఐ నారాయణనాయక్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యతపై అందరిపై ఉందన్నారు. వాతావరణ సమతుల్యత, జీవ వైవిధ్యం సవ్యం గా ఉండాలంటే ప్రకృతి సంపదను, జంతువులను రక్షించుకోవాలన్నారు. తాగునీటి కోసం కుంటల వద్దకు వచ్చే జంతువుల కోసం వేటగాళ్ళు ఉచ్చులు బిగించి వన్యప్రాణులను వేటాడితే నాన్బెయిలబుల్, పీడీయాక్ట్ కేసులు నమోదు చేస్తామ న్నారు. అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోందని, ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలను పాటించాలన్నారు. లక్షెట్టిపేట సర్కిల్ పరిధిలో ఎవరైనా వేటకు పాల్పడితే లక్షెట్టిపేట సీఐ 9440795047, ఎస్సై 9440795048, ఎస్సై దండేపల్లి 9440795049, ఎస్సైజన్నారం 9440795050 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.