తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్థులు
ABN , First Publish Date - 2020-12-15T06:01:04+05:30 IST
మండలంలోని కౌఠ(బి) గ్రామం పరిసరాలలో ఉన్న అటవీ భూముల చుట్టూ అటవీ శాఖ అధికారులు సోమవారం కందకాల త్వకాలు చేపట్టడంతో గ్రామంలోని వంద మంది రైతులు తవ్వకాలను నిలిపి వేయాలంటూ జేసీబీని వాహనాన్ని అడ్డుకు న్నారు.
బోథ్ రూరల్, డిసెంబరు 14: మండలంలోని కౌఠ(బి) గ్రామం పరిసరాలలో ఉన్న అటవీ భూముల చుట్టూ అటవీ శాఖ అధికారులు సోమవారం కందకాల త్వకాలు చేపట్టడంతో గ్రామంలోని వంద మంది రైతులు తవ్వకాలను నిలిపి వేయాలంటూ జేసీబీని వాహనాన్ని అడ్డుకు న్నారు. గత దశాబ్దాల కాలంగా దాదాపు మూడు నుంచి నాలుగు వం దల ఎకరాల అటవీ భూములల్లో రైతులు పంటల సాగు చేస్తుండడం తో తమ భూముల్లోకి వెళ్లకుండా అధికారులు అడ్డుకుంటున్నారని రైతులు తవ్వకాలు నిలిపి వేయాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో దాదాపు రెండు గంటల పాటు రైతులు అధికారులతో వాగ్వివాదానికి ది గారు. చివరకు విషయం బోథ్ రేంజి అధికారి సత్యనారాయణకు సి బ్బంది తెలుపడంతో అధికారి రైతులతో చర్చలు జరిపారు. సాగు భూ ముల్లో మొక్కలు నాటేది లేదని, ఈ విషయంలో ఆందోళన అవసరం లేదని తెలుపడంతో రైతులు సద్దుమనిగారు. ఈ సందర్భంగా రైతుల తరపున ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుడాల స్వామి, కౌఠ సర్పంచ్ కె.రాధిక, గంగాధర్, మాజీ సర్పంచ్ లంకటి నర్సయ్య తదిత రులు చర్చలు జరిపారు. భారీ సంఖ్యలో మహిళా రైతులు తరలి రావ డంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.