ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-17T06:14:19+05:30 IST

నిర్మల్‌ దేవరకోట లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ఉదయం 6 గంటలకు ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం
దర్శనం చేసుకుంటున్న భక్తులు

నిర్మల్‌ కల్చరల్‌, డిసెంబరు 16 : నిర్మల్‌ దేవరకోట లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ఉదయం 6 గంటలకు ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు శ్రీ వైష్ణవఆలయంలో గోదాదేవికి ఉదయం పాశురాలు అర్చకులు పఠిస్తారు. పాశురాల విశిష్టభక్తులకు వివరిస్తారు. ఆలయ అర్చకులు జగన్నాథచారి, నవీన్‌తో పాటు రామకణ్ణన్‌ ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందించారు. ఆలయకమిటీ మాజీ చైర్మన్‌ ఆమెడ కిషన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-17T06:14:19+05:30 IST