క్రీడా పోటీలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయి
ABN , First Publish Date - 2020-12-11T04:26:37+05:30 IST
క్రీడల వల్ల స్నేహ భావం పెరుగుతుందని జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ అన్నారు. గురువారం నార్నూర్ మండలంలోని గుంజాల లో ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలను డీసీసీబీ చైర్మన్ నాందేవ్ కాంగ్లేతో కలిసి ప్రారంభించారు.
నార్నూర్, డిసెంబరు 10: క్రీడల వల్ల స్నేహ భావం పెరుగుతుందని జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ అన్నారు. గురువారం నార్నూర్ మండలంలోని గుంజాల లో ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలను డీసీసీబీ చైర్మన్ నాందేవ్ కాంగ్లేతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. క్రీడా పోటీలతో యువతకు శారీక దృడత్వంతో పాటు స్నేహభావం పెరుగుతాయని అన్నారు. ఆటల పోటీలలో గెలుపు ఓటమిలు సహజమని ఓడిన వారు నిరాశ చెందకుండా గెలుపు కోసం ప్రయత్నించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కనక మోతుబాయి, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తొడసం నాగోరావు, జీవ వైవిద్య కమిటీ సభ్యులు మర్సుకోల తిరుపతి, ఉత్తం రాథోడ్, రమేష్, సర్పంచ్, ఎంపీటీసీ తదితరులు ఉన్నారు.