క్రీడా పోటీలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయి

ABN , First Publish Date - 2020-12-11T04:26:37+05:30 IST

క్రీడల వల్ల స్నేహ భావం పెరుగుతుందని జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌ అన్నారు. గురువారం నార్నూర్‌ మండలంలోని గుంజాల లో ఏర్పాటు చేసిన వాలీబాల్‌ పోటీలను డీసీసీబీ చైర్మన్‌ నాందేవ్‌ కాంగ్లేతో కలిసి ప్రారంభించారు.

క్రీడా పోటీలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయి
వాలీబాల్‌ పోటీలను ప్రారంభిస్తున్న జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌

నార్నూర్‌, డిసెంబరు 10: క్రీడల వల్ల స్నేహ భావం పెరుగుతుందని జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌ అన్నారు. గురువారం నార్నూర్‌ మండలంలోని గుంజాల లో ఏర్పాటు చేసిన వాలీబాల్‌ పోటీలను డీసీసీబీ చైర్మన్‌ నాందేవ్‌ కాంగ్లేతో కలిసి  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. క్రీడా పోటీలతో యువతకు శారీక దృడత్వంతో పాటు స్నేహభావం పెరుగుతాయని అన్నారు. ఆటల పోటీలలో గెలుపు ఓటమిలు సహజమని ఓడిన వారు నిరాశ చెందకుండా గెలుపు కోసం ప్రయత్నించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కనక మోతుబాయి, వైస్‌ ఎంపీపీ చంద్రశేఖర్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ తొడసం నాగోరావు, జీవ వైవిద్య కమిటీ సభ్యులు మర్సుకోల తిరుపతి, ఉత్తం రాథోడ్‌, రమేష్‌, సర్పంచ్‌, ఎంపీటీసీ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-12-11T04:26:37+05:30 IST