‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
ABN , First Publish Date - 2020-12-06T07:06:20+05:30 IST
ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ ధ్రువీకరణ పత్రాలతో పింఛన్లు పొందుతున్నారని అంశంపై ‘ఆంధ్రజ్యోతి’ మెయిన్లో వచ్చిన ‘పింఛన్ కావాలా..? అయితే చలో ఆదిలాబాద్’ అనే శీర్షికన వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు.

సోమవారం గ్రామసభలో విచారణ
ఆదిలాబాద్ టౌన్, డిసెంబరు 5: ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ ధ్రువీకరణ పత్రాలతో పింఛన్లు పొందుతున్నారని అంశంపై ‘ఆంధ్రజ్యోతి’ మెయిన్లో వచ్చిన ‘పింఛన్ కావాలా..? అయితే చలో ఆదిలాబాద్’ అనే శీర్షికన వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. దీనిపై జిల్లావ్యాప్తంగా ఆయావర్గాలతో పాటు దివ్యాంగుల్లో చర్చకు రాగా.. బేల మండలం సాంగిడి గ్రామస్థులు సైతం విషయం తెలుసుకొని బిత్తర పోయారు. ఇందుకు అధికారులు సోమవారం సాంగిడి గ్రామంలో గ్రామసభ నిర్వహించి సదరు వ్యక్తికి ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంపై విచారణ చేపట్టనున్నట్లు డీఆర్డీఏ డీపీఎం తెలిపారు. దీనిపై విచారణ చేపట్టనుండడంతో మరికొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.