స్వయం ఉపాధిని సద్వినియోగ పర్చుకోవాలి

ABN , First Publish Date - 2020-12-16T05:07:45+05:30 IST

గ్రామీణ యువత చెడు వ్యసనాలకు వెళ్లకుండా స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగ పర్చుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆదిలాబాద్‌ గోపాలకృష్ణ మఠం పీఠాదిపతి శ్రీ యోగానంద సరస్వతి అన్నారు. మంగళవారం మండలంలోని సాయిలింగి వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసిన స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

స్వయం ఉపాధిని సద్వినియోగ పర్చుకోవాలి
యోగానంద సరస్వతికి స్వాగతం పలుకుతున్న గ్రామస్థులు

తలమడుగు, డిసెంబరు 15: గ్రామీణ యువత చెడు వ్యసనాలకు వెళ్లకుండా స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగ పర్చుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆదిలాబాద్‌ గోపాలకృష్ణ మఠం పీఠాదిపతి శ్రీ యోగానంద సరస్వతి అన్నారు. మంగళవారం మండలంలోని సాయిలింగి వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసిన స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగానంద సరస్వతి మాట్లాడుతూ గ్రామీణ యువత చెడు వ్యసనాలకు వెళ్లకుండా సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు స్వయం ఉపాధి పథకాలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సద్వినియోగ పర్చుకొని సమాజాంలో మంచి గుర్తింపు తెచ్చు కోవాలని సూచించారు. గ్రామీణ యువత కోసం సాయిలింగి వృద్ధాశ్రమ వ్యవస్థాపకుడు దెబ్బడి అశోక్‌ ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ఇందులో జడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి, తహసీల్దార్‌ ఇమ్రాన్‌ ఖాన్‌, ఎంపీడీవో రమాకాంత్‌, సర్పంచ్‌ జంగాల రేవతి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-16T05:07:45+05:30 IST