ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని రాస్తారోకో

ABN , First Publish Date - 2020-12-30T04:47:38+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం వాంకిడిలో నాగ్‌పూర్‌-హైదరాబాద్‌ అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేశారు.

ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని రాస్తారోకో
వాంకిడిలో రాస్తారోకో చేస్తున్న బీజేవైఎం నాయకులు

వాంకిడి, డిసెంబరు29: రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న  ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం వాంకిడిలో నాగ్‌పూర్‌-హైదరాబాద్‌ అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఇన్‌చార్జి ఆత్మరామ్‌నాయక్‌ మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.  ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సుచిత్‌, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌, నాయకులు కిరణ్‌, శ్రీకాంత్‌చారి, వెంకటేష్‌, తిరుపతి పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-30T04:47:38+05:30 IST