ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని రాస్తారోకో
ABN , First Publish Date - 2020-12-30T04:47:38+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం వాంకిడిలో నాగ్పూర్-హైదరాబాద్ అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేశారు.
వాంకిడి, డిసెంబరు29: రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం వాంకిడిలో నాగ్పూర్-హైదరాబాద్ అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఇన్చార్జి ఆత్మరామ్నాయక్ మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సుచిత్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు కిరణ్, శ్రీకాంత్చారి, వెంకటేష్, తిరుపతి పాల్గొన్నారు.