లక్షా 16వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

ABN , First Publish Date - 2020-05-19T10:21:27+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ వంటి ప్రతి కూల పరిస్థితులలో కూడా జిల్లాలో లక్షా 16 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు

లక్షా 16వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

డీసీఎస్‌ఓ వెంకటేశ్వర్లు  


మంచిర్యాల కలెక్టరేట్‌, మే 18 : కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ వంటి ప్రతి కూల పరిస్థితులలో కూడా జిల్లాలో లక్షా 16 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వి.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సోమవారం మంచిర్యాల జిలా ్లలోని మంచిర్యాల, పలు మండలాల్లో కొనుగోలు కేంద్రాలు, గోడౌ న్‌లను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించడంలో ఆలస్యం, పలు అంశాలపై సూచనలు సలహాలు అందించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రైతులు ఎవరూ ఆంవదోళన చెందాల్సిన అవసరంలేదనీ, ధాన్యం విక్రయించిన 24 గంట ల్లోనే నగదు వారి ఖాతాల్లో జమ చేసేలా కృషి చేస్తున్నామన్నారు. జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారి కిష్టయ్య, ఆర్‌ఐ కొండయ్య, డిటిలు విజయ , గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-19T10:21:27+05:30 IST