‘ప్రజా సంక్షేమమే సర్కారు లక్ష్యం’
ABN , First Publish Date - 2020-09-06T09:03:21+05:30 IST
ప్రజల సంక్షేమమే సర్కారు లక్ష్యమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు అన్నారు...
![‘ప్రజా సంక్షేమమే సర్కారు లక్ష్యం’](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఇచ్చోడ, సెప్టెంబరు5: ప్రజల సంక్షేమమే సర్కారు లక్ష్యమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. పార్కును సుందరం గా చేయాలని సూచించారు. ఇచ్చోడ నుంచి పార్కు వరకు రోడ్డు మార్గం ఉం డేలా చూడాలన్నారు. రోడ్డుకు ఇరువైపు లా ప్రత్యేకమైన మొక్కలు హరితహారం లో భాగంగా నాటాలని తెలిపారు. అ నంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ సునీత చౌహాన్, టీఆర్ ఎస్ మండల కన్వీనర్ శ్రీనివాస్, ఎంపీ పీ ప్రీతంరెడ్డి, ఉప సర్పంచ్, ఎంపీటీసీ దేవనంద్ పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
గుడిహత్నూర్: మన్నూర్ మాజీ స ర్పంచ్ జలంధర్ తల్లి ఇటీవల మృతి చెందింది. శనివారం బాధిత కుటుంబా న్ని ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయన వెంట ఎంపీపీ రాథోడ్పుండలిక్, టీఆర్ఎ స్ మండల అధ్యక్షుడు కరాడ్ బ్రహ్మనం ద్, సర్పంచ్ కుమ్రశంభు ఉన్నారు.