అప్రమత్తతో వైద్య సేవలు అందించాలి..
ABN , First Publish Date - 2020-09-05T07:10:10+05:30 IST
జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది
![అప్రమత్తతో వైద్య సేవలు అందించాలి..](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది ప్రజలకు అప్రమత్తతో కూడిన వైద్యం అందించాలని డీఎంఅండ్హెచ్వో రాథోడ్నరేందర్ అన్నారు. శుక్రవారం డీఎంఅండ్హెచ్వో కార్యాలయంలోని ఆయన చాంబర్లో వైద్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొవిడ్ 19 పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు, సూచనలపై మాట్లాడారు.