బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు
ABN , First Publish Date - 2020-11-03T11:00:54+05:30 IST
ప్రగతిభవన్ ముట్టడికి వె ళ్తున్న బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టులకు నిరసనగా సోమవారం బీజేపీ నాయకులు ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ అనుచి త
ఏసీసీ, నవంబరు 2: ప్రగతిభవన్ ముట్టడికి వె ళ్తున్న బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టులకు నిరసనగా సోమవారం బీజేపీ నాయకులు ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు కార్యకర్తలను బెదిరించే ధోరణిలో మా ట్లాడినందుకు నిరసనగా ప్రగతిభవన్ ముట్టడికి వెళ్తున్న బీజేపీ నాయకులను అరెస్టు చేయడం అక్ర మమన్నారు. ప్రదీప్చంద్ర, హరికృష్ణ, మల్యాల శ్రీని వాస్, రాజన్న, రాకేష్ రేణ్వా, తదితరులున్నారు.
దండేపల్లి: బీజేపీ నాయకులను పోలీసులు ముం దస్తు అరెస్టు చేసి పోలీసుస్టేషన్కు తరలించారు. పార్టీ మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య మాట్లా డుతూ సీఎం కేసీఆర్, మంత్రుల నియంతృత్య వైఖ రికి నిరసన తెలిపే స్వేచ్ఛ లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చే స్తోందన్నారు. రవిగౌడ్, వేణు గోపాల్, సురేందర్, శ్రీనివాస్ అరెస్టు చేశారు.
కోటపల్లి: మౌనదీక్ష చేపట్టిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. పార్టీ మండలాధ్యక్షుడు పెద్దల సత్యం మాట్లాడుతూ దుబ్బాకలో బీజేపీ గెలుస్తుందనే భయం అధికార పార్టీకి పట్టుకుందని, దీంతో పోలీసులతో అరెస్టులు, అసత్య ప్రచారాలు చేస్తూ కేసులు పెట్టిస్తు న్నారన్నా రు. దుర్గం నర్సింహులు, చిట్యాల మోహన్, దుర్గం బాపు, కిష్టయ్య, దేవాజీ, తిరుపతి, పాల్గొన్నారు.
జైపూర్: ప్రగతిభవన్ ముట్టడికి వెళ్తున్న బీజేపీ నాయకులను ఎస్సై రామకృష్ణ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. డేగ నగేష్, బల్ల వెంకటేష్, పోచన్న, మద్ది సుమన్ యాదవ్, ప్రశాంత్ గౌడ్, వినోద్ గౌడ్, లవకుమార్, సతీష్ ఉన్నారు.
తాండూర్(బెల్లంపల్లి): బీజేపీ రాష్ట్ర కమిటీ పిలు పు మేరకు ప్రగతిభవన్ ముట్టడికి వెళ్తున్న బీజేపీ నాయకులను ఎస్ఐలు శేఖర్రెడ్డి, మానసలు అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. బీజేపీ మండలా ధ్యక్షుడు రామగౌని మహీధర్గౌడ్, జిల్లా ఉపాధ్యక్షు డు పులగం తిరుపతి, వెంకటేష్, విజయ్, ప్రదీప్, శ్రీకృష్ణదేవరాయలు, సురేష్, రాహుల్ ఉన్నారు.
హాజీపూర్: బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టుచేశారు. కృష్ణమూర్తి, వెంకటరమణారావు, తి రుపతి, కార్తీక్, నర్సయ్యలు ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అధికార దుర్వినియోగం పాల్పడుతూ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారన్నారు.
మందమర్రిటౌన్: హైద్రాబాద్కు తరలివెళ్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అప్రజాస్వామికమని బీజేపీ మండలా ధ్యక్షు డు పైడిమల్ల నర్సింగ్, నాయకులు డీవీ దీక్షితులు పేర్కొన్నారు. చప్పిడి నరేష్, రాంటెంకి దుర్గరాజ్, సమ్మయ్య, లక్ష్మణ్, రాజేందర్, లను అరెస్టుచేశారు.
కాసిపేట: ప్రగతిభవన్ ముట్టడికి వెళ్ళకుండ బీ జేపీ నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ మండలాధ్యక్షుడు సతీష్రెడ్డి మాట్లా డుతూ దుబ్బాకలో ఓటమి భయంతోనే బీజేపీ నా యకులను అరెస్టు చేస్తున్నారని తెలిపారు. మనోజ్ దాస్, రాజన్, మాదాసు సురేష్, శంకర్లు ఉన్నారు.
బెల్లంపల్లి టౌన్: బెల్లంపల్లిలో ముందస్తుగా 18 మంది బీజేపీ నాయకులను వన్టౌన్ ఎస్ఐ రాజు ఆ ధ్వర్యంలో అరెస్టు చేశారు. నాయకుల ఇండ్లలోకి వెళ్లిన పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తర లించారు. రాజులాల్యాద వ్, గోవర్దన్ల ఆధ్వర్యంలో పాత బస్టాండ్లో రాస్తారో కో చేస్తుండగా అడ్డుకొని ఠాణాకు తరలించారు. ము నిమంద రమేష్, రమేష్, సంతోష్, ఎరుకల నర్సింగ్, రాజన ర్సు, ఆకుల శంకర్, సంతోష్కుమార్ అరెస్టు చేశారు.
భీమారం: బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల అధ్యక్షుడు వేల్పుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రగ తిభవన్ ముట్టడికి వెళ్తున్న నాయకులను ఎస్ఐ బర్ల సంజీవ్ అరెస్టు చేసి స్టేష న్కు తరలించారు. అరెస్టు అయిన వారిలో నాయకులు జాడి ప్రభాకర్ ఉన్నారు.