ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2020-03-16T12:07:33+05:30 IST

మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఆదివారం నిర్వ హించిన ప్రవేశపరీక్ష ప్రశాంతంగా ముగిసింది...

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష

ఆదిలాబాద్‌టౌన్‌, మార్చి15: మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఆదివారం నిర్వ హించిన ప్రవేశపరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తం గా గురుకులాల్లో 6, 7, 8 తరగతు ల్లో 329 ఖాళీలకు పరీక్షలు నిర్వ హించారు. ప్రవేశ పరీక్షకు జిల్లా లో 23 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 12గంటల వరకు పరీక్ష కొన సాగింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చే సుకున్న విద్యార్థులు ఆయా పరీక్ష కేంద్రాలకు ఉదయం 9గంటలకే చేరుకున్నారు. ఈ పరీక్షలను రాష్ట్ర పరిశీలకులు రవికుమార్‌, గురుకు లాల ఆర్సీవో గోపిచంద్‌లు కేంద్రా లను సందర్శించి తనిఖీ చేశారు. పరీక్ష రాస్తున్న తీరును పరిశీలించ డంతో పాటు అక్కడ వసతులపై ఆరా తీశారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఆయా తరగతు ల్లో ప్రవేశాలు కల్పిస్తామన్నారు.


Updated Date - 2020-03-16T12:07:33+05:30 IST