ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాల ఏర్పాటుపై అభ్యంతరాలు
ABN , First Publish Date - 2020-12-03T06:15:27+05:30 IST
రైతువేదిక భవనాలపై ప్రఽధానమంత్రి నరేంద్రమోదీ, ఎంపీ సోయంబాపురావ్ చిత్రపటాలను ఏర్పాటు చేయాలని కోరుతూ నిర్మల్ జిల్లా బీజేపీ పార్టీ నేతల పిలుపు మేరకు బుధవారం మండల బీజేపీ నాయకులు తహసీల్దార్ కిరణ్మయికి వినతిపత్రం అందజేశారు.

తహసీల్దార్కు బీజేపీ నాయకుల వినతిపత్రం
నర్సాపూర్(జి), డిసెంబరు 2 : రైతువేదిక భవనాలపై ప్రఽధానమంత్రి నరేంద్రమోదీ, ఎంపీ సోయంబాపురావ్ చిత్రపటాలను ఏర్పాటు చేయాలని కోరుతూ నిర్మల్ జిల్లా బీజేపీ పార్టీ నేతల పిలుపు మేరకు బుధవారం మండల బీజేపీ నాయకులు తహసీల్దార్ కిరణ్మయికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు అర్జున్ఠాకూర్ మాట్లాడుతూ కేంద్రప్రభు త్వం నిధుల ఇస్తున్నా వేదికలపై ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని అన్నా రు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మిట్టపల్లి రాజేందర్ నాయకులు శేఖర్, కాల్వ లింగన్న, ప్రశాంత్,నర్సయ్య, భానుచంద్ర, రాజు, శ్రీధర్ నాయకులు పాల్గొన్నారు.