మున్సిపాలిటీలో వార్డు లెవల్ ఆఫీసర్ల నియామకం
ABN , First Publish Date - 2020-12-06T04:25:48+05:30 IST
స్వచ్ఛ సర్వేక్షణ్-2021లో భాగంగా మంచిర్యాల పట్టణం లో 36 వార్డులకు 36 మంది వార్డు లెవల్ ఆఫీసర్లను, 70 మెప్మా ఆర్పీలను, ఐదుగురు సూపర్వైజర్లను కేటాయించారు.

ఏసీసీ, డిసెంబరు 5 : స్వచ్ఛ సర్వేక్షణ్-2021లో భాగంగా మంచిర్యాల పట్టణం లో 36 వార్డులకు 36 మంది వార్డు లెవల్ ఆఫీసర్లను, 70 మెప్మా ఆర్పీలను, ఐదుగురు సూపర్వైజర్లను కేటాయించారు. వారి విధులపై అవగాహన కల్పిస్తూ మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, కమిషనర్ స్వరూపారాణిలు దిశ, నిర్దేశం చేశారు. శనివారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని మెప్మా సమావేశ హాల్లో సదస్సును ఏర్పాటుచేశారు. వారు మాట్లాడుతూ చెత్త సేకరణ, తడి, పొడి, ప్ర మాదకర చెత్తలను వేరు చేయడం, హోం కంపోస్ట్ ఏర్పాటు, రోడ్డుపై చెత్త పడే యకుండా చూడటం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఉత్తమ పారి శుధ్య విధులు నిర్వహించిన నలుగురు కార్మికులకు మెమొంటో బహూకరించి సన్మానించారు. మున్సిపల్ మేనేజర్, ఇంజనీర్, పాల్గొన్నారు.