మంచిర్యాలలో దారుణం
ABN , First Publish Date - 2020-11-03T14:33:09+05:30 IST
జిల్లాలోని నెన్నెల మండలం మన్నెగూడం అటవీ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది.
మంచిర్యాల: జిల్లాలోని నెన్నెల మండలం మన్నెగూడం అటవీ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. వన్యప్రాణుల కోసం కొందరు వేటగాళ్లు విద్యుత్ తీగలను అమర్చారు. దీన్ని గమనించని రైతులు తమ ఎద్దులను తీసుకెళ్తుండగా తీగలు తగిలి రెండు ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి. ఇద్దరు రైతులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.