విఠలేశ్వరుని నామస్మరణతో మార్మోగిన కుభీర్
ABN , First Publish Date - 2020-12-15T06:22:38+05:30 IST
కుభీర్ మండల కేంద్రం వారం రోజులుగా విఠలేశ్వరుని నామస్మరణతో మర్మోగి పోయింది.

మొక్కులు తీర్చుకున్న భక్తులు
కరోనా దృష్ట్యా జరగని జాతర
కుభీర్, డిసెంబరు 14 : కుభీర్ మండల కేంద్రం వారం రోజులుగా విఠలేశ్వరుని నామస్మరణతో మర్మోగి పోయింది. మండల కేంద్రం లోని విఠలేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసాన్ని పురష్కరించుకొని వారం రోజులుగా కొనసాగుతున్న తాళ సప్తమి ముగింపు వేడుక లు సోమవారం ముగిసాయి. ఈ సందర్భంగా ఆలయంలో వేకువజామున కాకడ హారతి, ఉదయం విఠలరుక్మిణీ దేవతామూర్తులకు అభి షేకంతో పాటు ప్రత్యేకపూజలు చేశారు. అనం తరం ఉత్సవమూర్తులను పూలతో అలంకరిం చిన రథంపై ఉంచి ప్రధానవీధుల గుండా భజనలు, భక్తి గేయాలను ఆలపిస్తూ భాజా భజంత్రీలతో శోభాయాత్ర నిర్వహించారు. గ్రామంలోని శివసాయి, ధనేశ్వర, హనుమాన్, తదితర ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేపట్టారు. కరోనా దృష్ట్యా జాతర, అన్నదానం నిర్వహించలేదు. ఎలాంటి అవాంఛనీయ సంఘ టనలు జరగకుండా ఎస్సై ప్రభాకర్రెడ్డి ఆధ్వ ర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆలయ పురోహితులు ప్రమోద్మహారాజ్, రాజు మహారాజ్, ఆలయ కమిటీ అధ్యక్షులు నార పరుశురాం పాల్గొన్నారు.