కొమురంభీం: ఎక్సైజ్ అధికారులను అడ్డుకున్న ఆదివాసులు
ABN , First Publish Date - 2020-11-07T16:27:06+05:30 IST
జిల్లాలోని జైనూరు మండలం కోలాంగూడలో ఎక్సైజ్ అధికారులను ఆదివాసులు అడ్డుకున్నారు.
![కొమురంభీం: ఎక్సైజ్ అధికారులను అడ్డుకున్న ఆదివాసులు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కొమురం భీం: జిల్లాలోని జైనూరు మండలం కోలాంగూడలో ఎక్సైజ్ అధికారులను ఆదివాసులు అడ్డుకున్నారు. గ్రామంలో నాటు సారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఆబ్కారీ సిబ్బంది సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోచెప్పులతో గ్రామ పటేల్ ఇంట్లో సోదాలు చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను ఆదివాసులు చుట్టుముట్టి ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.