కన్నుల పండువగా కార్తీకదీపోత్సవం
ABN , First Publish Date - 2020-11-26T05:10:26+05:30 IST
కార్తీక మాసం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. కొవిడ్ నిబంధన లకు అనుగుణంగా గోపాల కృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆదిలాబాద్టౌన్, నవంబరు 25: కార్తీక మాసం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. కొవిడ్ నిబంధన లకు అనుగుణంగా గోపాల కృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆల యంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో యోగానంద సరస్వతి స్వామి కార్తీక దీపాలను వెలిగించి కార్తీక మాసం విశిష్టతను ప్రజలకు వివరించారు. ఇందులో సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు ప్రమోద్కుమార్ఖత్రి, ప్రపుల్వఝే తదితరులు పాల్గొన్నారు.