బాల,బాలికల చట్టాలపై అవగాహన పెంపొందించాలి

ABN , First Publish Date - 2020-12-19T06:02:36+05:30 IST

18 సంవత్సరాలలోపు గల బాలబాలికలపై జరుగుతున్న దురాచారాలను అరికట్టడానికి తీసుకువచ్చిన చట్టాలపై అవ గాహన పెంపొందించాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజలింగు అన్నారు.

బాల,బాలికల చట్టాలపై అవగాహన పెంపొందించాలి
అవగాహన సదస్సులో మాట్లాడుతున్న అధికారి రాజలింగు

జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజలింగు

నిర్మల్‌టౌన్‌, డిసెంబరు 18 : 18 సంవత్సరాలలోపు గల బాలబాలికలపై జరుగుతున్న దురాచారాలను అరికట్టడానికి తీసుకువచ్చిన చట్టాలపై అవ గాహన పెంపొందించాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజలింగు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వెనుకబడిన తరగతుల వసతిగృహంలో అధికారులకు ఒక్కరోజు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీవోసీఎస్‌వో చట్టం బాలబాలికల రక్షణకోసం తీసుకువచ్చిందన్నారు. ఇలాంటి దురాచారాలను అరికట్టడానికి ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో స్ర్తీ, శిశు సంక్షేమ అధికారులు మురళీ, శైలజ, సలహాదారులు న్యాయవాది నరేందర్‌, క్రాంతి, కిరణ్‌, తది తరులు ఉన్నారు. 

Updated Date - 2020-12-19T06:02:36+05:30 IST