ప్రభుత్వ జూనియర్ కళాశాల తనిఖీ
ABN , First Publish Date - 2020-12-30T05:45:13+05:30 IST
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా మాధ్యమిక విద్యాధికారి జాదవ్ పరశురామ్ మంగళవా రం ఆకస్మిక తనిఖీ చేశారు.
దిలావర్పూర్, డిసెంబరు 29: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా మాధ్యమిక విద్యాధికారి జాదవ్ పరశురామ్ మంగళవా రం ఆకస్మిక తనిఖీ చేశారు. వార్షిక పరీక్షల కోసం తరగతి గదుల సంఖ్య, ఫర్నిచర్ వివరాలు, ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు, ఆన్లైన్ పూర్తి చేయడంపై ఆరా తీశారు. తర్వాత డిజిటల్ క్లాసుల పర్యవేక్షణ అంశాలపై కళాశాల ప్రిన్సిపాల్ శంకర్, అధ్యాపకులతో సమీక్షించారు.