గుండెపోటుతో రైతు మృతి
ABN , First Publish Date - 2020-02-08T11:38:42+05:30 IST
నిర్మల్ జిల్లా భైంసా మండలంలో బెజ్జూర్ గ్రామంలో శుక్రవారం గుండెపోటు జౌడ సాయరెడ్డి(28) మృతి చెందాడు.

భైంసా రూరల్, ఫిబ్రవరి 7 : నిర్మల్ జిల్లా భైంసా మండలంలో బెజ్జూర్ గ్రామంలో శుక్రవారం గుండెపోటు జౌడ సాయరెడ్డి(28) మృతి చెందాడు. కుటుంబికులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకా రం సాయరెడ్డి ఉదయం సమయంలో పంట పొలానికి వెళ్లి ఇంటికి చేరుకుని అక్కడ అకస్మాత్తుగా గుం డెపోటు రావడం వలన కుప్పకూలి కింద పడిపోయాడు. అది గమనించిన కుటుంబికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం భైంసాకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.