పిల్లలందరికీ పౌష్టికాహారం అందేలా చూడాలి
ABN , First Publish Date - 2020-12-29T06:07:47+05:30 IST
ప్రతి అంగన్వాడీ కేంద్రంలోని రెండు సంవత్సరాల నుండి 5 సంవత్సరాల పిల్లలకు పౌష్టికాహారం అందేలా చూడాలని పూణేకు చెందిన విశాల్ రోషిడ్, వినోద్ కుమార్ కేంద్ర బృందం పరిశీలకులు అన్నారు.
కేంద్ర పరిశీలకులు విశాల్ రోషిడ్, వినోద్కుమార్
మామడ, డిసెంబరు 28 : ప్రతి అంగన్వాడీ కేంద్రంలోని రెండు సంవత్సరాల నుండి 5 సంవత్సరాల పిల్లలకు పౌష్టికాహారం అందేలా చూడాలని పూణేకు చెందిన విశాల్ రోషిడ్, వినోద్ కుమార్ కేంద్ర బృందం పరిశీలకులు అన్నారు. సోమవారం మామడ మండలంలోని చందారం గ్రామంలో వారు పర్యటించారు. అంగన్వాడీ కేంద్రంలో రెండు సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లల ఇళ్లలోకి వెళ్లి వారి బరువు తూకం వేశారు. మరియు పిల్లల పెరుగుదలకు పౌష్టికాహారం అందుతుందా లేదా అని వివరాలు అడిగి తెలుసు కున్నారు. అంగన్వాడీ సెంటర్కు ప్రతి పిల్లాడు వచ్చేలా చూడాలని తెలిపారు. పిల్లలందరికీ పాలు, పండ్లు, గుడ్లు తప్పకుండా ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పౌష్టికాహారం అందిస్తుంది అని వాటిని ప్రతీఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్య క్రమంలో ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్ పాల్గొన్నారు.