ప్రత్యేక శ్రద్ధతో విద్యను బోధించాలి
ABN , First Publish Date - 2020-12-31T04:35:37+05:30 IST
కరోనా వైరస్ ప్రభావంతో మూతబడిన పాఠశాలలతో విద్యకు దూరమై ప్రస్తుతం కొనసాగుతున్న డిజిటల్, యాదగిరి దూరదర్శన్, ఆన్లైన్ ద్వారా తరగతులను వింటున్న విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధతో విద్యను బోధించాలని డీఈవో రవీందర్రెడ్డి అన్నారు.

ఆదిలాబాద్టౌన్, డిసెంబరు 30: కరోనా వైరస్ ప్రభావంతో మూతబడిన పాఠశాలలతో విద్యకు దూరమై ప్రస్తుతం కొనసాగుతున్న డిజిటల్, యాదగిరి దూరదర్శన్, ఆన్లైన్ ద్వారా తరగతులను వింటున్న విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధతో విద్యను బోధించాలని డీఈవో రవీందర్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గజిటెడ్ నెంబర్ 1 స్కూల్ను సందర్శించి ఉపాధ్యాయుల రిజిస్ట్రర్లను, డైరీలను పరిశీలించారు. క్రమంతప్పకుండా పాఠశాలకు హాజరుకావాలని ఉపాధ్యా యులకు ఆదేశాలు జారీ చేశారు. అటు జిల్లా సెక్టోరల్ అధికారి కంటెనర్సయ్య పట్టణంలోని సరస్వతినగర్ పాఠశాలను సందర్శించి పదవ తరగతి విద్యార్థులకు బోధిస్తున్న తరగతులపై ఆరా తీశారు.