రాజీమార్గమే రాజమార్గం

ABN , First Publish Date - 2020-12-30T04:43:20+05:30 IST

రాజీమార్గమే రాజమార్గమని జిల్లా మూడో అదనపు న్యాయ మూర్తి నారాయణబాబు అన్నారు.

రాజీమార్గమే రాజమార్గం
కేసు పరిష్కరిస్తున్న జిల్లా మూడో అదనపు న్యాయమూర్తి నారాయణబాబు

-జిల్లా మూడో అదనపు న్యాయ మూర్తి నారాయణబాబు 

ఆసిఫాబాద్‌, డిసెంబరు29: రాజీమార్గమే రాజమార్గమని జిల్లా మూడో అదనపు న్యాయ మూర్తి నారాయణబాబు అన్నారు. మంగళవారం కోర్టు ఆవరణలో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసుల సత్వర పరిష్కారం కోసం లోక్‌ అదాలత్‌లను సద్విని యోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆరు బ్యాంకు కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించారు. ఈ కార్యక్ర మంలో న్యాయవాదులు విద్యా సాగర్‌, నాగేష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-30T04:43:20+05:30 IST