చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-05-25T08:57:45+05:30 IST
కడెం మండలం కన్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 266 ప్రభుత్వ అసైన్డ్ భూమిని చెన్నూరు రాజన్నటువంటి వ్యక్తి ప్రభుత్వ ..
నిర్మల్ టౌన్, మే 24: కడెం మండలం కన్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 266 ప్రభుత్వ అసైన్డ్ భూమిని చెన్నూరు రాజన్నటువంటి వ్యక్తి ప్రభుత్వ భూమిలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్నప్పటికీ స్థానిక తహసీల్దార్కు అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం జరుగుతుంది. అందుకే ఆదివారం రోజున జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీని కలిసి అతనిపై ఫిర్యాదు చేసి ఆ ప్రభుత్వ భూమిని కాపాడి పేద ప్రజలకు పంచాలని బీజేపీ కృష్ణా గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్ రావుల రాంనాథ్ కలెక్టర్ను కోరగా వెంటనే అతనిపై చర్య తీసుకుని భూమిని స్వాధీనం చేసుకుంటామని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కే. భాస్కర్, దేవేంధర్గౌడ్, ప్రవీణ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.