పలుచోట్ల కరోనా నిర్దారణ క్యాంపులు
ABN , First Publish Date - 2020-12-01T06:20:23+05:30 IST
పెంబి పీహెచ్సీ ఆధ్వర్యంలో సోమవారం పలు చోట్ల కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
ఖానాపూర్, నవంబరు 30 : పెంబి పీహెచ్సీ ఆధ్వర్యంలో సోమవారం పలు చోట్ల కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని బస్టాండ్లో మండలంలోని బాదన్కుర్తి చెక్పోస్టు వద్ద ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేశారు. ఈ రెండు చోట్ల 282 మందికి కరోనాపరీక్షలు నిర్వహించగా అందరికీ నెగటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు రవికుమార్, కన్నయ్యలు పేర్కొన్నారు. ఆ కార్యక్రమంలో సిబ్బంది లత, వెంకటరమణ, గంగన్న, రాజేశ్వర్, రమేష్, ప్రేమలత, యోత్సన, పద్మ, పార్వతితో పాటు పలువురు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.