కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా భీం వర్ధంతి
ABN , First Publish Date - 2020-10-22T05:53:36+05:30 IST
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా కుమరం భీం వర్ధంతిని ఈనెల 30న నిర్వహిం చనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
కెరమెరి, అక్టోబరు21: కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా కుమరం భీం వర్ధంతిని ఈనెల 30న నిర్వహిం చనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం మండలంలోని హట్టి ఆశ్రమ పాఠశాలలో గిరిజన సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రతిసారి లాగా దర్బార్, సమావేశం నిర్వహించమన్నారు. భీంకు నివాళి ఘటించి గిరిజనుల సమస్యలు తెలుసు కుంటామని ఆయన పేర్కొ న్నారు. అనంతరం వర్ధంతి నిర్వహణ కమిటీని ఎన్ను కున్నారు. చైర్మన్గా భగవం తరావును ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ సుదీంద్ర, డీఎస్పీ అచ్చేశ్వర్రావు, ఎంపీపీ పెందూర్ మోతీరాం, జడ్పీటీసీ దృపతాబాయి, భీం మనుమడు సోనేరావు, గిరిజన సంఘాల నాయకులు ఆత్రం లక్ష్మణ్, బొజ్జిరావు, రఘునాథ్, రాజేశ్వర్, భీంరావు, ఎంపీడీఓ దత్తారాం, తహసీల్దార్ సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.