అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-11-29T06:13:58+05:30 IST

మండలంలోని కొలాంగూడలో అప్పుల బాధతో మడావి చిన్ను(32) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కొక్కుల రోహిణి తెలిపారు.

అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

గుడిహత్నూర్‌, నవంబరు 28: మండలంలోని కొలాంగూడలో అప్పుల బాధతో మడావి చిన్ను(32) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కొక్కుల రోహిణి తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. చిన్ను తన తల్లి పేరు మీద ఉన్న ఐదు ఎకరాల్లో ఈ యేడాది పత్తి పంట సాగు చేశాడు. ఇటీవల అధిక వర్షాలు కురవడంతో నష్టపోయాడు. కాగా, పంట సాగు కోసం స్థానిక మహారాష్ట్ర బ్యాంకులో రూ.80వేలు అప్పు తీసుకున్నాడు.  అప్పు ఎలా తీర్చాలో తీవ్ర మనస్థాపానికి గురై శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2020-11-29T06:13:58+05:30 IST