నేటి నుంచి పత్తి కొనుగోళ్లు
ABN , First Publish Date - 2020-12-07T12:25:03+05:30 IST
సీసీఐ ద్వారా మండలకేంద్రంలోని మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లను సోమవారం నుంచి చేపడుతున్నాట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ అశ్విత రాథోడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలి పారు.

మార్కెట్ కమిటీ చైర్మన్ అశ్విత
ఆదిలాబాద్: సీసీఐ ద్వారా మండలకేంద్రంలోని మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లను సోమవారం నుంచి చేపడుతున్నాట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ అశ్విత రాథోడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలి పారు. మార్కెట్ యార్డులో పత్తి పంటను విక్రయానికి వచ్చే రైతులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డు, పట్టాపాసు పుస్తకంతో పాటు బ్యాంకు అకౌంట్, పాన్ కార్డు, ఏదైనా గుర్తింపు కార్డు తప్పని సరిగా వెంట తీసుకురావాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రతీ రైతు మార్కెట్ యార్డులోనే విక్రయాలు చేయాలని తెలిపారు.