వరంగల్ ఎంజీఎంకు 54 రక్త నమూనాలు
ABN , First Publish Date - 2020-06-21T10:42:04+05:30 IST
జిల్లాలో కరోనా అనుమానితుల సంఖ్య రోజు రోజుకు రెట్టింపు అవుతోంది. కరోనా వ్యాధి నిర్ధారణకు 54 మంది రక్తనమూనాల ను శనివారం
![వరంగల్ ఎంజీఎంకు 54 రక్త నమూనాలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఐసోలేషన్లో 12, హోంక్వారంటైన్ 2,456 మంది
మంచిర్యాల అర్బన్, జూన్ 20: జిల్లాలో కరోనా అనుమానితుల సంఖ్య రోజు రోజుకు రెట్టింపు అవుతోంది. కరోనా వ్యాధి నిర్ధారణకు 54 మంది రక్తనమూనాల ను శనివారం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి పంపించారు. ఐసోలేషన్లో 12 మం ది, హోంక్వారంటైన్లో 2,456 మంది ఉండగా జిల్లాలో యాక్టివ్ కేసులు 11 ఉన్నాయి. ఇప్పటి వరకు 55 పాజిటివ్ కేసులు కాగా, ఇందులో లోకల్ 15 మంది, 37 మైగ్రేన్, మైగ్రేన్ లింక్ ముగ్గురు ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం 315 నమూనాలను పంపగా అందులో 55 పాజిటివ్ రాగా 260 నెగెటివ్గా వచ్చాయని జిల్లా కరోనా వ్యాధి పర్యవేక్షకుడు డా.బాలాజీ పేర్కొన్నారు.