తెలంగాణలో యువకుడికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ
ABN , First Publish Date - 2020-04-01T18:17:26+05:30 IST
నాగర్కర్నూల్ జిల్లాలో తొలిసారిగా కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. కల్వకుర్తి పట్టణానికి చెందిన...
నాగర్కర్నూల్లో తొలి పాజిటివ్ కేసు
కల్వకుర్తి యువకుడికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ
15 మంది కుటుంబ సభ్యులకు సెల్ఫ్ క్వారంటైన్
నాగర్కర్నూల్ (ఆంధ్రజ్యోతి): నాగర్కర్నూల్ జిల్లాలో తొలిసారిగా కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. కల్వకుర్తి పట్టణానికి చెందిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్ లక్షణాలున్నట్లు నిర్ధారణ అయ్యింది. జిల్లాలోని నాగర్కర్నూల్ నుంచి నలుగురు, కల్వకుర్తి నుంచి నలుగురు, అచ్చంపేట నుంచి మరో ముగ్గురు ఈ నెల 14న సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో ఢిల్లీకి తబలీక్ జమాత్లో పాల్గొనేందుకు వెళ్లారు. ఆ 11 మందిని సోమవారం జిల్లా ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వారి శాంపిల్స్ను గాంధీ ఆస్పత్రికి పంపించారు.
వారిలో కల్వకుర్తికి చెందిన 34 ఏళ్ల యువకుడికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. 18న కల్వకుర్తికి వచ్చిన ఆ యువకుడు వచ్చాక ఎవరెవరిని కలిశాడన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతని 15 మంది కుటుంబ సభ్యులను సెల్ప్ క్వారంటైన్లో ఉంచారు.