వన్‌ప్లస్ స్మార్ట్‌టీవీలపై తక్షణ డిస్కౌంట్ ఆఫర్

ABN , First Publish Date - 2020-10-22T02:02:14+05:30 IST

వన్‌ప్లస్ స్మార్ట్‌టీవీలపై తక్షణ డిస్కౌంట్ ఆఫర్

వన్‌ప్లస్ స్మార్ట్‌టీవీలపై తక్షణ డిస్కౌంట్ ఆఫర్

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్‌టీవీల తయారీ సంస్థ వన్‌ప్లస్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడళ్లలో స్మార్ట్‌టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. పండుగ సీజన్ల నేపథ్యంలో వన్‌ప్లస్ స్మార్ట్‌టీవీలపై తక్షణ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించినట్లు సంస్థ పేర్కొంది.


వన్‌ప్లస్ టీవీ వై సిరీస్‌లో రెండు వేరియంట్లలో టీవీలు మార్కెట్ అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఎలాంటి ఈఎంఐ ఛార్జీలు లేకుండా 3 నుంచి 6 నెలల వరకు కంతులవారిగా డబ్బు చెల్లించి వన్‌ప్లస్ టీవీ వై సిరీస్‌లో టీవీలను తీసుకెళ్లవచ్చని కంపెనీ వెల్లడించింది. వై సిరీస్ టీవీ కొనుగోలు చేసిన వినియోగదారులకు తక్షణ డిస్కౌండ్ ఆఫర్ కింద రూ. 1000 లభిస్తోంది.


ఎలాంటి ఈఎంఐ ఛార్జీలు లేకుండా 12 నెలల వరకు డబ్బు చెల్లించి వన్‌ప్లస్ టీవీ క్యూ1 సిరీస్‌ టీవీలను పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా టీవీలను కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ. 4,000 వరకు డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది.

Updated Date - 2020-10-22T02:02:14+05:30 IST