ప్రముఖ కార్ల సంస్థలపై కరోనా ప్రభావతం..
ABN , First Publish Date - 2020-03-27T21:44:24+05:30 IST
ప్రముఖ కార్ల తయారీ సంస్థలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. భారత మార్కెట్లో పలు కంపెనీలు తమ కొత్త కార్లను విడుదల చేయాల్సి ఉండగా..
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. భారత మార్కెట్లో పలు కంపెనీలు తమ కొత్త కార్లను విడుదల చేయాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం భారత్లో 21 రోజులపాటు లాక్డౌన్ ప్రకటించడంతో కార్ల విడుదలను వాయిదా వేసుకున్నాయి. భారత మార్కెట్లో మహీంద్రా ఎక్స్యూవీ300, మెర్సిడెస్ బెంజ్ తొలి ఎలక్ట్రిక్ కారు, పెట్రోల్ ఇంజిన్లతో రెనాల్ట్ డస్టర్ కారును త్వరలో ప్రవేశపెట్టనున్నారు.