బొగ్గు కుంభకోణం కేసులో మాజీ మంత్రికి..
ABN , First Publish Date - 2020-10-28T02:58:15+05:30 IST
బొగ్గు కుంభకోణం కేసులో మాజీ మంత్రికి..
![బొగ్గు కుంభకోణం కేసులో మాజీ మంత్రికి..](https://media.andhrajyothy.com/appimg/galleries/2020102709170579/10272020212748n13.jpg)
ఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బొగ్గు కుంభకోణం కేసులో మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రే జైలు శిక్షను హైకోర్టు నిలిపివేసింది.
1999లో జార్ఖండ్లోని బొగ్గు బ్లాకును ఒక ప్రైవేట్ కంపెనీకి అక్రమంగా కేటాయించినందుకు కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి దిలీప్ రేకు వేసిన మూడేళ్ల శిక్షను ఢిల్లీ హైకోర్టు మంగళవారం నిలిపివేసింది. అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో రే భాగంగా ఉన్నారు.