దుబాయ్లో నేహాకక్కర్,రోహాన్ దంపతుల హనీమూన్
ABN , First Publish Date - 2020-11-18T12:40:29+05:30 IST
ప్రముఖ గాయకురాలు నేహాకక్కర్, రోహాన్ ప్రీత్ సింగ్ నూతన దంపతులు హనీమూన్ కోసం దుబాయ్ దేశానికి వెళ్లారు.....
హోటల్లో ఒకరాత్రి బసకు రూ.90వేలు ఛార్జీ
దుబాయ్ : ప్రముఖ గాయకురాలు నేహాకక్కర్, రోహాన్ ప్రీత్ సింగ్ నూతన దంపతులు హనీమూన్ కోసం దుబాయ్ దేశానికి వెళ్లారు.దుబాయ్ లో తమ హనీమూన్ ఫొటోలు, వీడియోలను ఈ కొత్త జంట సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. నేహాకక్కర్ అభిమానులకు ఆసక్తి కలిగించే విషయం ఏమంటే ఈ జంట దుబాయ్ దేశంలోని అట్లాంటిస్ రిసార్టులోని రీగల్ సూట్ లో ఒక రాత్రి బస కోసం 90వేలరూపాయలు వెచ్చించారు. నేహా దంపతులు లగ్జరీ హోటల్ లోని రీగల్ సూట్ క్లబ్ లో ఉన్నారని వెల్లడైంది.
ఈ హోటల్ గదిలో ఒకరోజు రాత్రి ఉండటానికి 72, 403రూపాయలు అవుతుంది. ఈ జంట అల్పాహారం తీసుకుంటే 89,370 రూపాయలు ఖర్చ అవుతుందట. రాత్రి విందు చేస్తే 1,01,813 రూపాయలు అవుతుంది. ప్రైవేటు బీచ్ లో నేహాకక్కర్ తన భర్తతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. లవ్ సింబల్ ఆకారంలో ఉన్న కేక్ ను కట్ చేసి ఈ కొత్త జంట హనీమూన్ వేడుకలు జరుపుకున్నారు. నేహా కక్కర్ రోహన్ప్రీత్ సింగ్ను అక్టోబర్ 24 న ఢిల్లీలో వివాహం చేసుకున్నారు. ఈ కొత్త జంట సోషల్ మీడియాలో పంచుకున్న హనీమూన్ చిత్రాలు వైరల్ అయ్యాయి.