తృణధాన్యాల వాడకంతో వృద్ధుల్లో జ్ఞాపకశక్తి పెంపు
ABN , First Publish Date - 2020-02-20T09:46:53+05:30 IST
తృణధాన్యాల వాడకంతో వృద్ధుల్లో జ్ఞాపకశక్తి పెంపు
లండన్, ఫిబ్రవరి 19 : వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి తగ్గుముఖం పట్టడం సహజ ప్రక్రియే!! అయితే కూరగాయలు, తృణధాన్యాల వాడకంతో జ్ఞాపకశక్తి తగ్గే ప్రక్రియకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుందని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ(సిడ్నీ) శాస్త్రవేత్తలు అంటున్నారు. 1.39 లక్షల మంది వృద్ధులపై అధ్యయనం అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు వారు తెలిపారు. తృణధాన్యాల వాడకం పెంచితే ఆరు పదుల వయసులోనూ మతిమరుపు, హృద్రోగాలు, మధుమేహం, హైపర్ టెన్షన్ల ముప్పు నుంచి తప్పించుకోవచ్చన్నారు. బ్రిస్క్ వాక్, సైక్లింగ్, వాటర్ ఎరోబిక్స్ వంటి వ్యాయామాలతో వృద్ధుల్లో జ్ఞాపకశక్తి ఇనుమడిస్తుందని పేర్కొన్నారు.