వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న మహిళా పోలీసు
ABN , First Publish Date - 2020-05-21T13:20:35+05:30 IST
లాక్డౌన్లో రోడ్లపై తిరిగే మూగజీవాలకు ఆహారం అందక విలవిలలాడిపోతున్నాయి. దీనిని గమనించిన చెన్నైకి చెందిన ఒక మహిళా పోలీసు అధికారిణి వీధి కుక్కలకు ఆహారం అందిస్తున్నారు. ఈ మహిళా...
చెన్నై: లాక్డౌన్లో రోడ్లపై తిరిగే మూగజీవాలకు ఆహారం అందక విలవిలలాడిపోతున్నాయి. దీనిని గమనించిన చెన్నైకి చెందిన ఒక మహిళా పోలీసు అధికారిణి వీధి కుక్కలకు ఆహారం అందిస్తున్నారు. ఈ మహిళా పోలీసు అధికారిణి పేరు జి. సుభాలక్ష్మి. ఆమె ప్రతి రోజూ రాత్రి 11 గంటలకు కుక్కలకు బిస్కెట్లు పెడుతుంటారు. ఆమె విధులు ముగిశాక ఈ పని చేస్తుంటారు. తన కుమార్తె నుండి ఈ విషయంలో ప్రేరణ పొందానని డిప్యూటీ పోలీస్ కమిషనర్ సుభాలక్ష్మి తెలిపారు. 2015 లో వరదలు వచ్చినప్పుడు ఆమె కుమార్తె తమీజ్ చాలా కుక్కల ప్రాణాలను కాపాడారు. ఈ సమయంలో సుభాలక్ష్మి కూడా తన కుమార్తెకు సహాయం అందించారు. తమ ఇంట్లో మూడు కుక్కలు ఉన్నాయని, తమ కుమార్తెకు కుక్కలంటే ఎంతో ఇష్టమని సుభాలక్ష్మి తెలిపారు.