నీటి కోసం వాటర్ ట్యాంకర్ను ఆపిన ఏనుగు!
ABN , First Publish Date - 2020-11-16T16:34:11+05:30 IST
ఆ గజరాజుకు విపరీతంగా దాహమేసింది. ఇంతలో అటుగా ఒక వాటర్ ట్యాంకర్ వచ్చింది. దానిని...
బళ్లారి: ఆ గజరాజుకు విపరీతంగా దాహమేసింది. ఇంతలో అటుగా ఒక వాటర్ ట్యాంకర్ వచ్చింది. దానిని చూసిన ఏనుగు ఆ వాటర్ ట్యాంకర్ను ఆపి, నేరుగా తొండాన్ని ట్యాంకర్లో పెట్టి నీటిని గటా గటా తాగేసింది. అక్కడున్నవారంతా దీనిని వింతగా చూశారు. ఈ ఉదంతం కర్నాటకలోని హంపిలో జరిగింది. బళ్లారిలో హంపి ఉత్సవాలు జరిగాయి. వీటిని విజయ ఉత్సవాలు అని కూడా పిలుస్తారు. ఈ ఉత్సవాల సమయంలో ఏనుగులను ఊరేగిస్తారు.
ఈ నేపధ్యంలో గుంపులోని ఒక ఏనుగుకు దాహమేసింది. అటుగా వెళుతున్న వాటర్ ట్యాంకర్ను ఆపింది. దీంతో ఆ వాటర్ ట్యాంకర్ ఉన్న నడుపుతున్న డ్రైవర్ భయపడ్డాడు. అయితే ఆ ఏనుగు ట్యాంకర్ మూత వైపు చూడడంతో, దానికి దాహమేసిందని డ్రైవర్కు అర్ధమైంది. ఇంతలో ట్యాంకర్ మూతను తీయాలని అక్కడే ఉన్న మంత్రి ఆనంద్ సింగ్ కుమారుడు సిద్ధార్థ్ డ్రైవర్కు సూచించారు. ట్రాక్టర్పై నున్న వ్యక్తి ట్యాంకర్ మూత తీయడంతో, ఆ ఏనుగు తన తొండాన్ని ట్యాంకర్లో పెట్టి నీటిని తాగింది. తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయి, ఊరేగింపు ఉత్సవంలో పాల్గొంది.
‘న్యూస్ బెంగళూరు’ సౌజన్యంతో...