పురాతన ఫాస్ట్ ఫుడ్ సెంటర్.. 2వేల ఏళ్లనాటి ఆహారం లభ్యం!

ABN , First Publish Date - 2020-12-27T12:44:50+05:30 IST

పురాతన కాలంలో అగ్నిపర్వతం పేలి ఓ నగరం భూస్థాపితం అయిపోయింది. దీని కోసం గాలిస్తున్న పరిశోధకులకు తాజాగా ఓ అద్భుతమైన ఆధారం దొరికింది.

పురాతన ఫాస్ట్ ఫుడ్ సెంటర్.. 2వేల ఏళ్లనాటి ఆహారం లభ్యం!

పాంపేయ్: పురాతన కాలంలో అగ్నిపర్వతం పేలి ఓ నగరం భూస్థాపితం అయిపోయింది. దీని కోసం గాలిస్తున్న పరిశోధకులకు తాజాగా ఓ అద్భుతమైన ఆధారం దొరికింది. పాంపేయ్ ప్రాంతంలో తవ్వకాల్లో ఈ డిస్కవరీ జరిగింది. ఇక్కడి మట్టిలో ఓ పురాతన కాలపు దుకాణం దొరికింది. ఇది ప్రస్తుతం మనం చూస్తున్న స్ట్రీట్ ఫుడ్ స్టాల్ వంటిదని పరిశోధకులు చెప్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ దుకాణంలోని కొన్ని మట్టి పాత్రల్లో ఆ కాలం నాటి ఆహార పదార్థాలు, డ్రింకుల అవశేషాలు కూడా ఉన్నాయట. ఈ నగరం 79 ఏడీలో భూస్థాపితం అయిపోయినట్లు పరిశోధకులు చెప్తున్నారు. ఇప్పుడు తవ్వకాల్లో దొరికిన ఈ దుకాణం గోడలు పసుపు రంగులో ఉన్నాయని, అలాగే దీనిపై ఆహార పదార్థాల కోసం ఉపయోగించన జంతువుల బొమ్మలు కూడా వేసి ఉన్నాయని పరిశోధకులు తేల్చారు.

Updated Date - 2020-12-27T12:44:50+05:30 IST