జైపూర్లో 130 ఏళ్ల తరువాత మమ్మీ బయటకు!
ABN , First Publish Date - 2020-08-21T06:09:49+05:30 IST
ఈజిప్టులో ఉన్న మమ్మీల (ప్రాచీన మానవ కళేబరం) గురించి పుస్తకాల్లో చదువుకునే ఉంటారు. అలాంటి ఓ మమ్మీ మనదేశంలోనూ ఉంది.
ఈజిప్టులో ఉన్న మమ్మీల (ప్రాచీన మానవ కళేబరం) గురించి పుస్తకాల్లో చదువుకునే ఉంటారు. అలాంటి ఓ మమ్మీ మనదేశంలోనూ ఉంది. అది కూడా ఈజిప్టు నుంచి తీసుకొచ్చిందే! ఆ మమ్మీని 130 ఏళ్ల తరువాత మొదటిసారి బయటకు తీశారు. ఇది 2400 ఏళ్ల క్రితం నాటిది. ఇంతకీ ఆ మమ్మీని ఎందుకు బయటకు తీశారో తెలుసా? భారీవర్షాల కారణంగా వరదలు వచ్చి మమ్మీ మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది.
- జైపూర్లోని ఆల్బర్ట్ హాల్ మ్యూజియంలో ఒక మమ్మీ ఉంది. శతాబ్దం కిందట ఆ మమ్మీని ఈజిప్టులోని కైరో నుంచి రాజస్థాన్ తీసుకొచ్చారు. ఒక గ్లాసు బాక్సులో పెట్టి, సురక్షితమైన ప్రదేశంలో పెట్టారు. ఆ మమ్మీ పేరు ‘టుటు’.
- ఇటీవల రాజస్థాన్లో భారీ వర్షాలు కురిసి వరదలు ముంచెత్తాయి. మ్యూజియంలో వరద నీరు మోకాలి లోతు వరకు చేరింది. కంప్యూటర్లు, ప్రింటర్లు, రికార్డులు అన్నీ తడిసి ముద్దయ్యాయి. దాంతో అధికారులు ముందు జాగ్రత్తగా మమ్మీని అక్కడి నుంచి తరలించారు.
- 130 ఏళ్ల క్రితం ఈజిప్టు నుంచి తీసుకొచ్చాక, ఆ మమ్మీని బయటకు తీయడం ఇదే మొదటిసారి. వరదల మూలంగా మ్యూజియంను తాత్కాలికంగా మూసేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.